షర్మిలపై తప్పుడు ప్రచారాలు మానుకోండి
NEWS Oct 28,2024 01:44 pm
కొండపల్లి: మహాభారతంలో శకుని కౌరవ సామ్రాజ్యం పతనానికి ఎలాగ కుట్రలు చేశారో.. నేడు విజయసాయిరెడ్డి.. మాజీ సీఎం జగన్ వైపు ఉంటూ వైసీపీ పతనానికి పన్నాగం పన్నుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ అన్నారు. కొండపల్లిలో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి, కొంతమంది వైసీపీ నాయకులు.. జగన్ దగ్గర మెప్పు కోసం నిన్న షర్మిలపై ఆరోపణలు చేశారన్నారు. షర్మిలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.