కోర్టుకు హాజరైన దేవినేని ఉమా
NEWS Oct 28,2024 01:42 pm
విజయవాడ ముఖ్య మేజిస్ట్రేట్లో విచారణ నిమిత్తం టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. షాబాద్-జక్కంపూడిలో గతంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్లిన సమయంలో దేవినేని ఉమా, టీడీపీ నేతలపై నాటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఉమాతోపాటు నరేంద్రబాబు, రమేష్, పున్నారావు, సుబ్బారావు, నరేంద్ర, షేక్ కరిముల్లా, మాధవరావు, జమలయ్య కోర్టుకు హాజరయ్యారు.