పవిత్ర సంగమం వద్ద కొరవడిన నిఘా
NEWS Oct 28,2024 01:40 pm
పవిత్ర సంగమం అంతా అభద్రతా ప్రాంతంగా మారింది. పోలీసు, మున్సిపల్ శాఖ నిఘా పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న చిన్నారులు స్నానం చేస్తున్న దృశ్యం భద్రత ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. రాత్రి సమయంలో సంగమం ప్రాంతం పూర్తిగా అంధకారంగా ఉంటుంది. ఒక లైటు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి భద్రత కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.