ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలంటూ వినతి
NEWS Oct 28,2024 11:53 am
మల్యాల మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్ముతున్నారని మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం MRO మునీందర్ కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించకుండ పురుగుల, గడ్డి మందులు విక్రయించడం వలన పలువురు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని, కావున అధికారులు నిబంధనలతో కూడిన మందులు అమ్మేవిదంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కటకం వినయ్, సతీష్ రెడ్డి, ప్రతాప్, మారుతీ పాల్గొన్నారు.