బీజేపీ ఎంపీని మెచ్చుకున్న మోదీ
NEWS Oct 28,2024 08:44 am
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఐరన్మ్యాన్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్మ్యాన్ 70.3 ఛాలెంజ్లో ట్రయథ్లాన్ ఉంటుంది. దీంట్లో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగు ఛాలెంజ్ను పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్గా తేజస్వి సూర్య రికార్డు సృష్టించారు. ఐరన్మ్యాన్ ఛాలెంజ్ చేపట్టేందుకు ఫిట్ ఇండియా ఉద్యమమే ప్రేరణగా నిలిచిందని ఎంపీ తేజస్వి అద్భుతమైన ఫీట్ను అందుకున్నట్లు ప్రధాని మోదీ అభినందించారు.