ప్రజావాణికి అక్షర చిట్ఫండ్ బాధితులు
NEWS Oct 28,2024 07:49 am
జగిత్యాల: అక్షర చిట్ ఫండ్లో చీటి కట్టి మోసపోయామని జగిత్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చీటి వేలంపాట అయి రెండేళ్లు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని సుమారు 1500 పైగా బాధితులు ఉన్నారని, సుమారు 2 కోట్లకు పైగా చిట్టి డబ్బులు కట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్షర చిట్ ఫండ్పైన కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.