రేపు హైదరాబాద్లో MEOలకు శిక్షణ
NEWS Oct 28,2024 07:51 am
మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓలకు హైదరాబాద్లో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వారికి విధులపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ శిక్షణకు హాజరుకావాలని ఎంఈఓలకు విద్యాశాఖ సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. జిల్లా నుంచి 18 మంది ఎంఈఓలు శిక్షణకు హాజరవుతారని డిఇఓ వివరించారు.