కాలువలో వైద్యుడి మృతదేహం లభ్యం
NEWS Oct 28,2024 05:18 am
మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామ శివారులోని వరద కాలువలో ఆదివారం గల్లంతైన వైద్యుడు ఉదయ్ కిరణ్ రెడ్డి(29) మృతదేహం అదే గ్రామ శివారు కాలువలో ఉదయం లభ్యమైంది. గల్లంతైన వైద్యుడు ఉదయ్ కిరణ్ రెడ్డి మెట్పల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఉదయ్ కిరణ్ రెడ్డి స్వస్థలం వరంగల్. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించారు.