ఇరువురి మరణంతో గ్రామంలో విషాదం
NEWS Oct 27,2024 06:11 pm
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. తాటిపల్లి గ్రామానికి చెందిన పిల్లి జలపతి (55) గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి తన ఇంటి వద్ద మృతి చెందారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జలపతి తొడబుట్టిన అక్క అయిన సింక రాజవ్వ (80) తమ్ముడి మరణ వార్తను తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ ఇరువురి చావుతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.