చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య
NEWS Oct 27,2024 05:49 pm
మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డల జ్యోతి అనే మహిళ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. జ్యోతి పదేళ్లుగా షుగర్, హైబీపీతోపాటు మోకాళ్ల నొప్పులతో బాధపడుతుందని ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం బాగుపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.