మాజీ సైనికుడి పాడే మోసిన ఎమ్మెల్యే
NEWS Oct 27,2024 02:01 pm
డుంబ్రిగుడ మాజి సైనికుడు పాంగి మల్లన్న అనారోగ్యం కారణంగా నిన్న శనివారం రాత్రీ మరణించారు. అతడి స్వగ్రామం అయిన అరమ గ్రామ పంచాయితీ సంతవలస గ్రామంలో అంత్యక్రియల్లో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని స్వయంగా పాడే మోశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగడ సానుభూతి వ్యక్తం చేస్తూ, సైనికుడిలా సమాజానికి చేసిన సేవను గుర్తు చేశారు.