మల్యాల మండల కేంద్రంలోని కోటేష్ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. మెయిన్ గేట్ తీసుకొని ఇంటి ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం నంబర్ ప్లేటు విరగ్గొట్టి ఎత్తుకెళ్లడంతో బాధితుడు శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.