ఢిల్లీ విద్యా విధానం అమలు చేయాలి
NEWS Oct 27,2024 11:50 am
మెట్పల్లి: ఢిల్లీ తరహా విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయాలని సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొక్కెనపల్లి నాగరాజ్ అన్నారు. మెట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఈఓ, ఏంఈఓ, అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం సకాలంలో భర్తీ చేయాలన్నారు. గురుకులాలలో, హాస్టల్లో, పాఠశాలలలో, కళాశాలలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో నాంపల్లి గట్టయ్య, శంకర్ ఉన్నారు.