ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదు
NEWS Oct 27,2024 03:09 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా ప్రకటన విడుదల చేశారు. మెదక్ జిల్లాలో మెడికల్ కళాశాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు ఏకైక మహిళ ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె తెలిపారు. మాజీ CM కేసీఆర్ 100 సీట్లతో మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే దాని 50 సీట్లకు కుదించడం బాధాకరమని ఆమె అన్నారు.