20 ఏళ్ల రేచల్ గుప్తా(పంజాబ్) ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకుంది. బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించింది. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుంది. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ను గెలుచుకుంది.