వేంపల్లి శివాలయానికి 35000 విరాళం
NEWS Oct 27,2024 09:56 am
మల్లాపూర్: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరసిల్లుతున్న వేంపల్లి చిన్న గుడి రాజన్న (పురాతన శివాలయం) లో గణపతి, పార్వతి, సూర్యుడు, నాగేంద్ర స్వామి.. కొలువై ఉన్నారు. వేంపల్లి గ్రామానికి చెందిన రొడ్డ గంగామణి - నర్సయ్య దంపతుల కుమారుడు రొడ్డ రాజేష్ (బ్యాంకు ఉద్యోగి) 35,000 రూపాయలు విరాళం ఈ రోజు కమిటీ సభ్యులకు అందించారు. వారి కుటుంబానికి శివయ్య అనుగ్రహం ఉండాలని కమిటీ సభ్యులు ప్రార్థించారు.