షర్మిల కన్నీళ్లకు విలువలేదు: VSR
NEWS Oct 27,2024 09:06 am
జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో షర్మిల పావుగా మారారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. షర్మిల కన్నీళ్లకు విలువలేదన్నారు. ఆమెను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో పాటు, కుట్రలు చేసిన చంద్రబాబుతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందని ప్రశ్నించారు. ప్రత్యర్థుల కుట్రలో భాగమవ్వటం శోఛనీయమన్నారు.