మల్యాల: భూగర్భ జలాలపై అవగాహన
NEWS Oct 27,2024 07:19 am
తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలలో సహాయ స్వచ్ఛంద సంస్థ, భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు జల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. జిల్లా భూగర్భ జల శాఖ అధికారి గంగ నర్సింహా, కైలాస సత్యార్థి చైల్డ్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ భూమేష్, ప్రిన్సిపల్ మానస, భూగర్భ జల శాఖ అధికారులు రాజ్ కుమార్, రవీందర్, కుమార్, సహాయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు లత, లహరి, ప్రసాద్, చైల్డ్ లైన్, జిల్లా ఉమెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.