తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!
NEWS Oct 26,2024 06:13 pm
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలను అప్పగిస్తూ తీర్మానం చేసింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటి నాగోల్-ఎల్బీనగర్-హయత్ నగర్, రెండోది ఎల్బీ నగర్-శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది.