మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Oct 26,2024 06:03 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలని ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడుకే రవిచంద్రన్ శనివారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం పెంచిన రూ.1,000, 7 నెలల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతినెల 5 లోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఉస్మాన్, కార్యదర్శి వి జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.