బీడీ కార్మికుల హామీలు అమలు చేయాలి
NEWS Oct 26,2024 05:52 pm
మల్యాల మండల కేంద్రంలో శనివారం బీడీ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) జిల్లా శాఖ 2వ మహాసభకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, జిల్లా అధ్యక్షులు కొక్కుల శాంత, గోవర్ధన్, రాములు, మౌలానా, ముక్రం, బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.