టీమిండియా ఘోర ఓటమి
చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు
NEWS Oct 26,2024 02:22 pm
న్యూజిలాండ్ తో రెండో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం. పుణేలో మూడ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్ లో కివీస్ 113 పరుగుల భారీ తేడాతో నెగ్గి, 3 టెస్టుల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. భారత్ తన సొంతగడ్డపై ఓ టెస్టు సిరీస్ ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.