విద్యార్థులకు అకాడమిక్ డైరెక్టర్ అవగాహన
NEWS Oct 26,2024 02:39 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్ లో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా ఆఘాజు 2k24 (డిప్లమా ఫ్రెషర్స్ డే)కార్యక్రమానికి అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడారు. ట్రినిటీ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండరని అన్నారు. దీనికోసం గత కొద్ది మాసాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీల్డ్ ట్రిప్ ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాలు నిర్వహించి సాంకేతికపరంగా విద్యార్థులకు ఆ అవగాహన కల్పించారు.