మెదక్ జిల్లా రామయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఐసిఎస్ చైర్మన్ బాదేతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా, కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులు గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.