మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి బృందం పర్యటించారు. క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా రెండు రోజులపాటు మున్సిపాలిటీలో వారు పర్యటించనున్నారు. మున్సిపాలిటీకి వచ్చిన బృందానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ స్వాగతం పలికారు. మున్సిపాలిటీలోని పలు విభాగాలను వారు పరిశీలించారు. ప్రభుత్వం నుండి అందుతున్న సేవా కార్యక్రమాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ప్రభుత్వ పాఠశాలలను వారి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.