గల్ఫ్ మృతుని కుటుంబానికి పరామర్శ
NEWS Oct 26,2024 12:24 pm
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ మూడు రోజుల క్రితం బెహరాన్ లో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోగా శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. తొందరలోనే మృతదేహాన్ని ఇక్కడికి తెప్పిస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా సుధీర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.