నరసింహుడిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
NEWS Oct 26,2024 10:15 am
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు.