రొళ్ల మండలంలో టిడిపి సభ్యత్వ నమోదు
NEWS Oct 26,2024 09:21 am
రొళ్ల మండలం వటే బెంట్టా గ్రామంలో శనివారం టిఎన్ టీయుసి రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి స్వామి, కుంచిటిగా వక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప మండల కన్వీనర్ దాసిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.100 చెల్లించి టిడిపి సభ్యత్వ నమోదు చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యదర్శి ఈరన్న, యువ నాయకులు భరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.