గంగారెడ్డి కుటుంబీకులను పరామర్శించిన మధుయాష్కి
NEWS Oct 26,2024 09:03 am
జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధుయాష్కి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.