అక్రమ మద్యం రవాణా - వ్యక్తి అరెస్టు
NEWS Oct 26,2024 09:24 am
మైలవరం మండలం మొరసుమిల్లి గ్రామం లో రాత్రి సమయంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ మైలవరం జరిపిన దాడులలో జి. కొండూరు గ్రామానికి చెందిన పజ్జురి గోపి అనే వ్యక్తిని ద్విచక్ర వాహనంలో 06 మాన్షన్ హౌస్ బ్రాందీ 750 ml (తెలంగాణ మద్యం) సీసాలను అక్రమంగా రవాణా చేస్తుండగా అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై ఎం.దుర్గా ప్రసాద రావు, కానిస్టేబుల్స్ సర్వేష్ చెన్నకేశవులు రాజకుమార్ పాల్గొన్నారు.