ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
NEWS Oct 26,2024 06:07 pm
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేగ్యారపు శ్రీహరి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 నెలలోనే ఎంతో మందికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను చెక్కులు పంపిణీ చేశారని చెప్పారు. తను గెలిచిన తర్వాత తొలిసారి దూలూర్ గ్రామానికి ఎల్ఓసి అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధనుంజయ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రంజిత్, రాజు తదితరులు పాల్గొన్నారు.