సిరిసిల్ల: మెగా రక్తదాన శిబిరం
NEWS Oct 26,2024 03:24 am
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం 9 గంటలకు సిరిసిల్లలోని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది. స్థానిక పద్మ నాయక కల్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజన్న ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పోలీసులు కోరారు.