దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
NEWS Oct 26,2024 03:11 am
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాక్సన్ పల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాతకు అర్చకులు రావికోటి పార్థివ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.శనివారం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి, మంగళహారతి ఇచ్చారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వన దుర్గమ్మ ను దర్శించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మరుమోగింది.