ఎమ్మెల్సీ అభ్యర్థితో బీజేపీ నేతల భేటీ
NEWS Oct 25,2024 05:01 pm
ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. దొరబాబు మాట్లాడుతూ.. కూటమి నేతలు అందరూ రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, చిట్టూరి రాజేశ్వరి, జగతా శాంతి, గుమ్మల్ల రెడ్డి నాయుడు, అరిగెల తేజ వెంకటేష్, దాట్ల వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు.