ఇబ్రహీంపట్నం 23వ వార్డులో మంచినీటి పంపుల నుండి వృథాగా నీళ్లు పోతున్నాయి. అవసరం లేని చోట్ల వృధాగా పంపులు వేశారు. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ పంపులకుమోటర్లు బిగించి నీటిని వృథా చేస్తున్నారు. దీనివల్ల కొంతమందికి నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొనవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.