గంగవ్వపై కేసు.. ఫైన్తో క్లోజ్
NEWS Oct 25,2024 03:51 pm
పంజరంలో చిలుకను బంధించారని బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, మై విలేజ్ షో బృందంపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో అటవీ శాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మై విలేజ్ షో బృందం రూ. 25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్ తెలిపారు. దీంతో కేసును ముగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చట్టం గురించి తమకు తెలియదని మై విలేజ్ షో సభ్యుడు అనిల్ చెప్పారు. చిలుక జోస్యం వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.