ఓటుహక్కును నమోదు చేసుకోవాలి
- రాజారామ్ యాదవ్
NEWS Oct 25,2024 03:48 pm
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రానున్న నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకో వాలని ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. రాజారామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. మెట్పల్లిలో పలువురు న్యాయవాదులను, డిగ్రీ కళాశాలలో విద్యార్థులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.