మాల మహానాడు రాష్ట్ర ప్రధాన
కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్
NEWS Oct 25,2024 05:23 pm
కొత్తగూడెం: రాష్ట్ర మాల మహానాడు నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద రంజిత్ కుమార్ ను నియమిస్తున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ప్రకటించారు. హైదరాబాద్ మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రంజిత్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. మాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి భవిష్యత్తులో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని రంజిత్ కుమార్ తెలిపారు.