చిత్రకారుడిని అభినందించిన గవర్నర్
NEWS Oct 25,2024 05:09 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కవి, చిత్రకారుడు రాజేష్ కలిసి ఆయన గీసిన గవర్నర్ బొమ్మను బహుమతిగా అందజేశారు. తన చిత్రపటాన్ని చూసి గవర్నర్ రాజేష్ ని అభినందించారు. చక్కని చిత్రపటాన్ని గీసి గవర్నర్ కు అందజేసినందుకు రాజేష్ ని జిల్లా కలెక్టర్ జితేష్ అభినందించారు. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు పాల్గొన్నారు.