మళ్లీ నల్గొండపై ఫ్లోరైడ్ బూతం
NEWS Oct 25,2024 12:11 pm
మళ్లీ నల్గొండలో నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిలో ఫ్లోరైడ్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో భూగర్భ జలాల్లో 10 పిపిఎం కంటే ఎక్కువగానే ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 73 మండలాలు ఉండగా 23 మండలాల్లో భూగర్భ జలాల్లో నిర్ణీత పరిమితి, పరిణామాల కంటే ఎక్కువ శాతం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. నార్కెట్ పల్లి, మునుగోడు మండలాల్లోని గ్రామాల్లో 5 పిపిఎం కంటే ఎక్కవ ఫ్లోరైడ్ ఉన్నట్లు నివేదికల్లో చెప్పారు.