వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS Oct 25,2024 05:08 pm
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి, మానాల, లంబాడిపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, లచ్చన్న, నర్సింహారెడ్డి, వంశీ, తిరుపతి, మల్లేశం, ఐకేపీ వీవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.