బాలికల వసతిగృహం తనిఖీ
NEWS Oct 25,2024 05:11 pm
పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహన్ని ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో తాగునీటి, విద్యుత్, ఫ్లోర్ తదితర సమస్యలను వార్డెన్ విజయ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రఫిక్ మునసాకు మండల నిధుల నుండి నిధులు తీసుకొని సమస్యలు తీర్చాలని ఆయనకు అదేశించారు. వారితో అధికారులు, నేతలు ఉన్నారు.