D4 13 L కాలువ రూట్ మ్యాప్ మార్చండి
NEWS Oct 25,2024 11:49 am
హుస్నాబాద్: గౌరవేళ్లి ప్రాజెక్టు నుంచి పిల్ల కాలువ D4 13 L కాల్వ కోసం ప్రభుత్వం భూసేకరణ నిర్మాణ చేపట్టడంతో హుస్నాబాద్ పట్టణంలో సుమారు 200 పై చిలుకు రైతులు భూములు కోల్పోవడం జరుగుతుంది, దీనికిగాను శుక్రవారం రోజున ఆర్డిఓ ఆఫీస్ లో మెమోరండం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఈ సమస్య ప్రతి ఒక్కరి జీవన్మరణ సమస్య, ఈ కాలువ వలన ప్రజలు ఆరోగ్యానికి గురి అవ్వడం కాక చాలా కుటుంబాలు రోడ్డున పడడం జరుగుతుంది అని వాపోయారు. కాల్వ రూట్ మ్యాప్ మార్చకపోతే ప్రాణాలకు సైతం లెక్కచేయమని రైతుల డిమాండ్ చేశారు.