ట్రాలీ ఆటోను ఢికొని వ్యక్తికీ గాయాలు..
NEWS Oct 25,2024 08:23 am
నర్సాపూర్ మండల కేంద్రంలో తుప్రాన్ వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాలీ ఆటో యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానికులు 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.