వరి ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు?
NEWS Oct 25,2024 06:00 am
కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఇప్పటికి కూడా వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేరని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విఫలమని మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గన్నె టెండర్ను ఏర్పాటు చేయలేరని, దీని ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల ముందు వడ్ల కొనుగోలుపై కమిటీ ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు కేంద్రాలు, గన్నే బ్యాగుల టెండర్లు వేసేవారని అన్నారు.