మదనపల్లెలో పేలిన ఎలక్ట్రిక్ బైక్
NEWS Oct 25,2024 05:23 pm
మదనపల్లెలో ఛార్జింగ్ పెట్టిన ఎలట్రిక్ బైక్ గురువారం అర్థరాత్రి పేలి పోయిందని మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప శుక్రవారం ఉదయం తెలిపారు. దేవతనగర్లో ఎలక్ట్రిక్ బైక్ కాలి పోతోందని సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారన్నారు. వెంటనే ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకుని మంటలను అదుపు చేశామన్నారు. అప్పటికే బైకు పూర్తిగా కాలిపోయిందని సుమారు రూ. 1. 50 లక్షలు నష్టం జరిగినట్లుగా నిర్థారించామన్నారు.