తిరుపతి వెళ్లే బస్సు సమయంలో మార్పులు
NEWS Oct 25,2024 03:36 am
జహీరాబాద్ నుంచి తిరుపతి వరకు నడుపుతున్న బస్సు వేళల్లో మార్పులు చేసినట్లు డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 26 నుంచి జహీరాబాద్లో మధ్యాహ్నం 1:15 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు తిరుపతిలో ఉదయం 3:30 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి జహీరాబాద్ కు రాత్రి 10:45 గంటలకు చేరుకుంటుందరు. ప్రయాణికుల సమాచారాన్ని గ్రహించి, సంస్థకు సహకరించాలని కోరారు.