మృతుల కుటుంబాలకు SP పరామర్శ
NEWS Oct 25,2024 05:25 pm
అన్నమయ్య జిల్లా ఎస్పీ పీలేరు పట్టణంలో రైల్వే ట్రాక్ పై మరణించిన యాసిన్, కిరణ్ ల ఇంటికి వెళ్లారు. వారి తల్లిదండ్రులతో, బంధువులతో మరణించిన సంఘటన గురించి చర్చించి వాళ్లను ఓదార్చారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.