రహదారిపై గుంతలు పూడ్చిన ఎస్ఐ
NEWS Oct 24,2024 06:30 pm
మల్యాల నుండి క్రాస్ రోడ్ వెళ్లే దారిలోని ఎల్లమ్మ గుడి వద్ద ఏర్పడిన గుంతలను స్థానిక ఎస్ఐ నరేష్ కుమార్ పూడ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఎస్సై వెంటనే స్పందించి జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో సిమెంటు, కాంక్రీట్ తో గుంతలు పూడ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు, పలువురు యువకులు పాల్గొన్నారు.