సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలల పాటు మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండనున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేస్తారు.